IT companies : ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఐటీ కంపెనీలను సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో ఉద్యోగుల కోత అనివార్యమవుతోంది. గూగుల్, ఫ్లిప్ కార్డ్, యూనిటీ సాఫ్ట్ వేర్, పేటీఎం, అమెజాన్ తదితర ఐటీ, ఈ కామర్్ కంపెనీలు వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దేశీయ దిగ్గజం టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా అదే దారిలో పయనిస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రెండు కంపెనీలు 11,781 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పడం గమనార్హం. టీసీఎస్ 5,680 మందిపై వేటు వేసింది. ఇన్ఫోసిస్ 6,101 మంది ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. ఈనేపథ్యంలో ఉద్యోగులకు కష్టకాలం దాపురించనుంది. ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తే వారి భవిష్యత్ ప్రశ్నార్థకం కానుందని చెబుతున్నారు.
గతంలో కూడా ఆర్థిక మాంద్యం కారణంగా చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉద్యోగాలు పోగొట్టుకున్న సంఘటనలు తెలిసినవే. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురు కావడంతో ఉద్యోగుల భవితవ్యం గందరగోళంలో పడింది. ఈ క్రమంలో ఐటీ కంపెనీల తీరుతో వారి ఉపాధి గల్లంతవుతోంది. ఫలితంగా నిరుద్యోగ సమస్య తలెత్తనుందని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.
టీసీఎస్ లో ఉద్యోగులను తొలగించిన తరువాత మిగిలిన ఉద్యోగులు సుమారు 6 లక్షలు. ఇన్ఫోసిస్ లో కూడా ఉద్యోగులను తీసేయగా మిగిలిన వారు సుమారు 3.22 లక్షలు. దీంతో ఉద్యోగుల్లో భారీ కోత విధించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులకు ప్రస్తుతం గడ్డుకాలమే నడుస్తోంది. వారు మళ్లీ కొత్త ఉద్యోగాలు చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.