Extra-marital affair : నగర శివారులోని పెద్ద అంబర్ పేట్ లో యువకుడి మృతదేహంను పోలీసులు కొన్ని రోజుల కింద గుర్తించారు. డాక్టర్స్ కాలనీ సమీపంలో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి పోస్ట్ మార్టంకు తరలించారు. అయితే ఇది హత్య లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. మృతదేహం రాజేశ్ అనే వ్యక్తిదని గుర్తించిన పోలీసులు చావుపై కూపీ లాగగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో రాజేశ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, బహుషా ఆమె భర్తనే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తన్నారు. ఉపాధ్యాయురాలి భర్తతో పాటు మరికొంత మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
అయితే రాజేశ్ మృతితో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆమె భర్త నాగేశ్వర్ రావు చెప్తున్నాడు. ఈ రాజేశ్ ఎవరో తనకు తెలియదని, అతను ఎవరో తెలియకుండా దాడి చేసి చంపడం ఏంటని నాగేశ్వర్ రావు ప్రశ్నిస్తున్నాడు. అయితే ఆమెకు రాజేశ్ తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడి ఉండవచ్చు గాక ఈ విషయం కూడా నాకు తెలియదని ఆయన చెప్పడంతో పాటు తన భార్య మృతి సస్పెన్స్ గా ఉందని, ఆమె చావు మిస్టరీని చేదించాలని నాగేశ్వర్ రావు కోరడం పోలీసులకు పాలుపోవడం లేదు.
హయత్ నగర్ కు చెందిన ప్రభుత్వ టీచర్ తో రాజేశ్ కు కొంత కాలంగా పరిచయం ఉంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం సదరు టీచర్ భర్తకు తెలియడంతో చాలా సార్లు హెచ్చరించాడట. తాను సూసైడ్ చేసుకుంటానని రాజేశ్ తో చాటింగ్ లో చెప్పింది. అలా అయతే తాను సూసైడ్ చేసుకుంటానని రాజేశ్ కూడా చాటింగ్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మే 24న సదరు టీచర్ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. ఆ రోజు నుంచి రాజేశ్ ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుండగా. ఆమె కొడుకు గమనించాడు. అతను తన స్నేహితులతో కలిసి రాజేశ్ ను కొట్టి హెచ్చరించి వదిలేసినట్లు తెలిసింది.