Anasuya Comments :
ప్రముఖ వ్యాఖ్యాత, సినీనటి అనసూయ అందరికి సుపరిచితమే. తన అందంతో అందరిని ఆకర్షిస్తోంది. సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో మంచి పాత్రలు ఎంచుకుని నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈనేపథ్యంలో ఆమె రజాకార్ అనే సినిమాలో నటించింది. దాని నిర్మాత బీజేపీ నాయకుడు కావడంతో అనసూయ బీజేపీలో చేరతారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె తన మనసులోని మాట వెల్లడించింది.
తనకు రాజకీయాలంటే శ్రద్ధ లేదని చెప్పింది. తాను నటిగానే కొనసాగుతానని స్పష్టం చేసింది. రాజకీయాలు వేరు. అవి చేసే వారికి అవకాశం ఇద్దాం. కానీ మనం రాజకీయాలు చేయాలనుకోవడం సరికాదు. రాజకీయాలు వేరు సినిమాలు వేరు. ప్రస్తుతం సినిమాలపైనే తన ఫోకస్ ఉంటుందని చెప్పింది. రాజకీయాలంటే తనకు అంత ఆసక్తి లేదని పేర్కొంది.
జబర్దస్త్ ద్వారా మంచి స్థానం దక్కించుకున్న అనసూయ మెల్లగా సినిమాల్లో ప్రవేశించింది. తరువాత వ్యాఖ్యాతకు విరామం ఇచ్చి పూర్తి స్థాయి నటిగా మారింది. ఇటీవల విడుదలైన విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. రంగస్థలంలో రంగమ్మత్తగా అందరి మెప్పు పొందింది. పుష్పలో దాక్షాయణిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక పుష్ప 2లో కూడా ఓ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
రజాకార్ నిర్మాత నారాయణరెడ్డి మిమ్మల్ని బీజేపీలో చేరమంటే ఏం చెబుతారంటే మా మధ్య ఆ టాపిక్ ఎప్పుడు రాలేదని తెలిపింది. రాజకీయాల్లో చేరాలనే ఆశ తనకు లేదని తెలిపింది. దీంతో అనసూయ రాజకీయాల్లోకి రారనే విషయం స్పష్టమైంది. సినిమాల ద్వారానే తాను అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రకటించింది.