Anchor Sreemukhi : తెలుగు బుల్లితెరపై అందం అభినయం ఉన్న యాంకర్ అంటే గుర్తుకు వచ్చే పేర్లలో శ్రీముఖి తప్పకుండా ఉంటుంది. యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన ఈ సుందరి మెల్ల మెల్లగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇటు షోలను, అటు మూవీస్ ను బాగా మేనేజ్ చేస్తుంది ఈ సుందరి.
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘జులాయి’లో హీరో చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత లవ్ ఇష్క్ కాదల్ తో హీరోయిన్ గా మారింది. తెలంగాణ బిడ్డ అయిన శ్రీముఖికి వెండితెరపై కనిపించాలని చిన్నతనం నుంచి కోరిక ఉండేదట. ఆ మేరకు కష్టపడి ఆ రంగంలో ప్రతిభ చూపింది. చదువులో చురుకుగా ఉండే బుల్లితెర రాములమ్మ డాక్టర్ విద్యను అభ్యసించేందుకు సిద్ధమైంది. అందుకు బీడీఎస్ లో కూడా సీటు దక్కించుకుంది. కానీ మధ్యలో బుల్లితెరపై కనిపించే ఆఫర్లు వస్తుండడంతో అటువైపు వెళ్లలేదు.
అయితే ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ కొడుకును వివాహం చేసుకోబోతోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఆమె ఖండించింది. సదరు ప్రొడ్యూసర్ కొడుకును వివాహం చేసుకుంటే ఇండస్ట్రీలో తిరుగు లేదన్న వార్తలు ఇండస్ట్రీలో చెక్కర్లు కొట్టాయి. అయితే.. అప్పటికే శ్రీముఖి లవ్ లో ఉందని అందుకే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకుందని వార్తలు వినిపించాయి.
ఏది ఏమైనా తన ఫ్యాన్స్ కు కనువిందు చేయడంలో ఆమె ముందే ఉంటుంది. తమ ఫ్యాన్స్ కోసం ఇన్ స్టాలో పిక్ లను అప్ లోడ్ చేస్తుంది. గోల్డ్ కలర్ శారీలో ఆమె దిగిన ఫొటోలు ఇన్ స్టాలో పోస్ట్ చేయగా లైకుల మీద లైకులు వస్తున్నాయి.
View this post on Instagram