PM Modi : కేంద్ర ఎన్నికల సంఘం లో ఇద్దరు ఎలక్షన్ కమిష నర్ల ఎంపికకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కమిటీ ఈ నెల 14వ తేదీన భేటీ కానుంది. ఈసీ అరుణ్ గోయల్ ఇటీవల రాజీనామా చేయడం చర్చనీయంగా మారింది.
మరో ఈసీ అనుపు చంద్ర పాండే పదవీకాలం ఈ నెల 14 తో ముగియనుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానున్నడం తో కొత్త కమిష నర్లను ఒక కేంద్రమంత్రి, లోక్ సభ ప్రతిపక్ష నేత ఆధిర్ రంజన్ తో కూడిన కమిటీ ఎంపిక చేయ నుంది.
ఎన్నికలవేళ ఈసీ అరుణ్ గోయల్ ఎందుకు రాజీ నామా చేశారు అన్న సందేహం ఇప్పుడు అందరి లోనూ నెలకొంది. రాజకీయ ఒత్తిడి ఏమైనా ఉన్నా యా అనే కోణంలో అందరూ చర్చించుకుం టున్నా రు.
అయితే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ కమిషనర్ల ఎంపిక ప్రక్రియను ప్రధాని మోడీ వేగవం తం చేశారు. కమిటీ భేటీ తర్వాత ఇద్దరు కమీష నర్లను నియమించే అవకాశం కనబడు తోంది.