Faria Abdullah :113H, 10Y ప్రకారం ‘ఇచ్చేయండి సార్ పాపం బెయిల్ ఇచ్చేయండి’ అంటూ సిటీ బస్సు రూట్ల నెంబర్లను సెక్షన్లుగా చెప్పి కోర్టులో కేసు వాదించిన ఫరియా అబ్ధుల్లా గుర్తుండే ఉంటుంది. స్ట్రాటింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫన్నీగా సాగే సినిమా ‘జాతి రత్నాలు’. ఈ సినిమా ఆమెకు మొదటిదే అయినా స్టార్ ఇమేజ్ ను సంపాదించి పెట్టింది.
ప్రస్తుతం ఫరియా అబ్ధుల్లా దుబాయ్ లో ఉన్నారు. దుబాయ్ లో ‘గామా-2024’ అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో రెడ్ కార్పెట్ పై ఫరియా అబ్ధుల్లా రెడ్ డ్రస్ లో ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించింది.
ఫరియా ప్రస్తుతం అల్లరి నరేశ్ తో కలిసి ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావడంతో కంటెంట్ బాగుంటే సినిమా పెయిర్ పరంగా బాక్సాఫీస్ సక్సెస్ సాధిస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు.
‘జాతి రత్నాలు’ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత నాగార్జున, నాగ చైతన్యతో కలిసి ‘బంగార్రాజు’ మూవీలో ‘వాసివాడి తస్సాదియ్యా’ పాటలో స్టెప్పులేస్తూ అలరించింది.
మాస్ మహరాజా రవితేజ ‘రావణాసుర’ లోనూ ఫరియా అబ్దుల్లా నటించింది. ఈ మూవీకి ముందు సంతోష్ శోభన్ దర్శకత్వంలో ‘లైక్ షేర్ సబ్స్కైబ్’ లో హీరోయిన్ గా నటించింది. చక్కటి అందం హీరోలనే ఆశ్చర్య పరిచే హైట్ తో అందాల బొమ్మ ఫరియా అన్ని అవకాశాలను ఎగరేసుకుపోతోంది.