Rakhi Sawant: రాఖీ సావంత్ కు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రీసెంట్ గా మరో వివాదంలో చిక్కుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఎప్పట్లానే ఈ సారి కూడా తన కష్టాలకు కారణం తన భర్త ఆదిల్ ఖాన్ దురానీనే కారణం అని ఆరోపణలు చేస్తుంది. ఈ సారి సమస్య మాత్రం మరింత క్లిష్టమైంది.ఆదిల్ ఖాన్ దురానీ-రాఖీ సావంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత హనీమూన్ వెళ్లారు. హనీమూన్ లో తన భార్య రాఖీ సావంత్ ను న్యూడ్ గా ఫొటో షూట్ చేశాడట ఆదిల్ ఖాన్. ఆ ఫొటోస్, వీడియోలను దుబాయ్ లో రూ. 50 లక్షలకు అమ్ముకున్నాడని రాఖీ సావంత్ ఆరోపణలు చేస్తుంది.
‘అదిల్, నేను హనీమూన్ కు వెళ్లాం. ఆ టైమ్ లో నేను బాత్ టబ్ లో ఉండగా ఆదిల్ కొన్ని వీడియోలు తీశాడు. ఆ తర్వాత బూత్ రూమ్ లో నగ్నంగా స్నానం చేసేప్పుడు మరికొన్ని వీడియోలు తీశాడు. బెడ్పై ఉన్నప్పుడు కూడా వీడియో షూట్ చేశాడు. ఇప్పడు ఆ వీడియోలను ఓ అరబ్ వ్యక్తికి రూ.47 నుంచి 50 లక్షలకు అమ్మేశాడు.’
ఇలా సరికొత్త ఆరోపణలు చేసింది రాఖీ. దీంతో పాటు మరో విషయాన్ని కూడా ఆమె చెప్పింది. పెళ్లికి ముందే ఆదిల్ తనను లైంగికంగా వేధించాడని చెప్పింది.
‘ఒక రోజు ఆదిల్ చెల్లి నాకు ఫోన్ చేసింది. నాకు కారు బహుమతిగా ఇస్తానంది. ముంబైకి పంపించాలని ఆమెను కోరాను. నువ్వే మైసూర్ కు వచ్చి తీసుకెళ్లు అని చెప్పింది. దీంతో గిఫ్ట్ తీసుకునేందుకు మైసూర్ వెళ్లా. ఆదిల్ ఎక్కడని అడిగితే గదిలో ఉన్నాడని చెప్పా. నేను లోపలకు వెళ్లాను. ఇంతలోనే బయట నుంచి ఒక వ్యక్తి లాక్ చేసి వెళ్లిపోయాడు. ఆ టైమ్ లో ఆదిల్ నాపై లైంగిక దాడి చేశాడు.’
గదిలోకి వెళ్లిన తర్వాత ఆదిల్ రాఖీ సావంత్ దుస్తులను చింపేశాడట. 3 గంటల పాటు ఏం చేయాలని అనుకున్నాడో అన్నీ చేసేశాడట. ఆ తర్వాత సారీ చెప్పాడట. రాఖీ గోవాకు వెళ్తే, అక్కడికి కూడా వచ్చి పళ్లి చేసుకుందామని ఒప్పించాడట. ఇలా తనకు అన్యాయం చేసిన ఆదిల్ ను భర్తగా భావించడం లేదనీ, విడాకులు కోరుకుంటున్నానని చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించి రాఖీ సావంత్ మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్తుందట.