NTRఎన్టీఆర్ ఏది తీసినా సంచలనమే. అప్పుడు ఆయన ప్రత్యేకత అలా ఉండేది. ఆయనకున్న విలువ అలా పెరిగింది. ఎన్టీఆర్ 1977లో దానవీరశూర కర్ణ సినిమా తీశారు. దానికి ప్రేక్షకులు జేజేలు పలికారు. దానికి వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం సినిమా తీశారు. కానీ అది ఆడలేదు. ఇది హిట్టయింది. దీంతో ఎన్టీఆర్ జైత్రయాత్ర కొనసాగింది. అప్పట్లో అల్లూరి సీతారామరాజు కూడా ఎన్డీఆర్ తీయాలని అనుకున్నా కృష్ణ తీయడంతో ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసి కొన్నాళ్లు వారి మధ్య మాటలు లేకుండా పోయాయట.
దానవీర శూరకర్ణలో కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడి పాత్రలు చేశాడు. కృష్ణుడి పాత్రను అక్కినేని నాగేశ్వర్ రావు ను చేయమని ఎన్టీఆర్ అడిగారట. కానీ దానికి ఆయన నో చెప్పారట. కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ అయితేనే కరెక్టు. వేరే వారు వేస్తే ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అందుకే ఆ పాత్ర తాను చేయలేనని సూటిగా చెప్పారట. ఎన్టీఆర్ కంటే ఏఎన్నార్ పొట్టిగా ఉండటంతో ఆ పాత్రకు తాను తగనని తప్పుకున్నారట.
ఎన్టీఆర్ మూడు పాత్రలు చేసి మెప్పించారు. దానవీర శూరకర్ణ బ్రహ్మాండమైన హిట్టయింది. కురుక్షేత్రం ఫట్టయింది. ఇలా ఒకే కథతో ఒకేసారి సినిమా తీస్తే ప్రేక్షకులు సరిగా తీసుకోరు. అందుకే కురక్షేత్రాన్ని తుస్సుమనిపించి దానవీరశూర కర్ణను మాత్రం హైలెట్ చేశారు. ఆ రోజుల్లో రూ. 10 లక్షలతో సినిమా తీస్తే రూ. కోటి వచ్చాయట. అంటే ఎంత హిట్టయిందో అర్థమవుతుంది.
తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లిన నటుడు ఎన్టీఆర్. ఆయన నటించిన ప్రతి సినిమా ఆయనలోని నటన కౌశలాన్ని బయట పెట్టింది. దానవీరశూర కర్ణలోని ఏమంటివి ఏమంటివి అనే మాటలు ఇప్పటికి కూడా తెలుగు వారి చెవుల్లో మారుమోగుతుంటాయి. ఎన్టీఆర్ చెప్పిన ఆ సంభాషణలు ఇప్పటికి కూడా ఇంపుగానే ఉంటాయి. అలా దానవీరశూర కర్ణ తెలుగు వారికి ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం కావడం విశేషం.