![Rajasthan Royals](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/0r7l3cgg_virat-kohli-bcci_625x300_22_May_24.webp)
Rajasthan Royals : ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ ఆల్ రౌండ్ పర్పామెన్స్ తో ఘన విజయం సాధించి ఎలిమినేటర్ 2 మ్యాచ్ కు అర్హత సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ 2 మ్యాచ్ లో అదిరిపోయే పర్పామెన్స్ తో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ తో ఆర్సీబీని ఇంటి బాట పట్టించింది.
ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అనుకున్న విధంగానే ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగే బంతులతో డుప్లెసిస్, కొహ్లిలను అడ్డుకున్నాడు. దీంతో పవర్ ప్లే లో అనుకున్నంత రన్స్ రాలేవు. 39 పరుగుల జట్టు స్కోరు బోర్డు వద్ద డుప్లెసిస్ అవుట్ కాగా.. 59 పరుగులకే రెండో వికెట్ రూపంలో కొహ్లి అవుటయ్యాడు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు పడుతున్న కొద్దీ 200 పరుగులు కావాల్సిన దశలో 172 పరుగులకే ఆర్సీబీ ఇన్సింగ్స్ ను ముగించింది.
ఆర్సీబీ ప్లేయర్లలో రజత్ పటిదార్ 34 పరుగులతో రాణించగా.. మహిపాల్ రామ్ రోర్ 32 పరుగులు, విరాట్ 33 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 4 ఓవర్లలోనే కేవలం 19 పరుగులే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు.
173 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు యశస్వి జైశ్వాల్, కడ్ మోర్ మంచి ఆరంభం ఇచ్చారు. మొదటి వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యం ఇచ్చారు. అయితే ధ్రువ్ జురేల్ 112 పరుగుల వద్ద రనౌట్ అయ్యే సమయానికి మ్యాచ్ ఆర్సీబీ వైపు మళ్లినట్లు కనిపించగా.. ఇంఫాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సిమ్రాన్ హిట్ మయర్ దంచి కొట్టడంతో గెలుపు బాట పట్టింది. చివర్లో రియాన్ పరాగ్, హిట్ మయర్ ను సిరాజ్ అవుట్ చేసినా మరో వెస్టిండీస్ క్రికెటర్ రావ్ మెన్ పావెల్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఇన్సింగ్స్.