CAA Act : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన CAA పౌరసత్వ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించనుంది. CAA నిబంధనలపై స్టే విధించాలని వచ్చిన పిటిషన్లను మార్చి 19న విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీ కరించింది.
కాగా.. CAAలో సవరణలు మత ప్రాతిపదికన జరిగాయని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్త మవుతున్న విషయం తెలిసిందే. దీంతో CAA చట్టంపై స్టే విధించాలని సుప్రీం కోర్టు ను కొందరు ఆశ్రయించారు. పిటిషన్ లను స్వీకరించినట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపిoది.
CAA చట్టంపై ఈనెల 19 తేదీన విచారణ చేపడతామని పిటిషన్ వేసిన వారికి తెలియ జేశారు. మత ప్రాతిపదికన చట్టంలో సవరణలు జరిగాయని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని మా రాష్ట్రాల్లో అమలు చేయమని ఇప్పటికే స్పష్టం చేశాయి.