Khammam Seats : తెలంగాణ ఎన్నికల్లో టఫ్ ఫైటే కనిపిస్తున్నది. ఈసారి అధికారం చేజిక్కంచుకోవడం అధికార బీఆర్ఎస్ కు కత్తి మీద సాములాగే కనిపిస్తున్నది. ఇక ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాలు జట్టు కట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. బీజేపీ, జనసేన పొత్తు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లాపైనే అందరి దృష్టి పడింది.
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలు వేరుగా ఉండేవి. రాష్ర్టమంతా బీఆర్ఎసస్ హవా కొనసాగినా ఖమ్మంలలో మాత్రం పాగా వేయలేకపోతున్నది. పది స్థానాల్లో కేవలం 1,2 సీట్లకే పరిమితమవుతున్నది. 2014, 2018 ఎన్నికల్లో ఇవే ఫలితాలు వచ్చాయి. 2014 లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావ్ ఒక్కరే ఖమ్మంలో గెలిచారు. తరువాత ఉప ఎన్నికల్లో తుమ్మల గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి ఒక్క సీటే దక్కింది. కాంగ్రెస్, టీడీపీ హవా కనిపించింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ విపరీతంగాపుంజుకున్నది. వైఎస్సార్టీపీ, టీడీపీ బరిలో లేకున్నా, ఆ శ్రేణులంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు.
ఇక ఖమ్మంలో కీలక నేతలుగా ఉన్న తుమ్మల, పొంగులేటి, కోరం కనకయ్య, తాట వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. ఇక సామాజికవర్గం పరంగా చూసుకున్నా ఖమ్మంలో ఈసారి కాంగ్రెస్ వైపే అంతా చూస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఖమ్మంలో పదిస్థానాలకు పది స్థానాలు కాంగ్రెస్ గెల్చుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని రాజకీయ విష్లేశకులు భావిస్తున్నారు. సెటిలర్ల హవా నడిచే ఈ జిల్లాలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తర్వాత జరిగిన పరిణామాలు బీఆర్ఎస్ కు దూరంగా జరిగేలా మారాయి. ఇక కాంగ్రెస్ ఈ అవకాశాన్ని వదులుకునేలా కనిపించడం లేదు.