YS Jagan beat SI : ఏపీ సీఎం వైఎస్ జగన్ పలు కేసుల్లో నిందితుడు. తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ, ఈడి కేసులు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా పదేపదే జగన్ అవినీతిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటాయి. అయితే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. జగన్ గతంలో ఒక ఎస్ఐని కొట్టాడని పవన్ వ్యాఖ్యలు చేశారు..
జగన్ మోహన్ రెడ్డి గతంలో తండ్రి సీఎం పదవిని అడ్డుపెట్టుకొని రకరకాల పైరవీలు చేసి అవినీతి సొమ్ము సంపాదించాడని పవన్ ఆరోపించారు. హ్యూమన్ రైట్స్ కార్యకర్తలు రాసిన పుస్తకంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ ని కొట్టి ఎస్ఐనే సెల్ లో వేసినట్లు ప్రస్తావించాడు. అలాంటి వ్యక్తికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారని, డీజీపీ లాంటి వ్యక్తులు అంట కాగుతున్నారని మండిపడ్డారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జగన్ పులివెందుల రౌడీ రాజకీయాన్ని చేస్తున్నారని, గోదావరి జిల్లాల్లో వైసీపీ నేతలను ప్రశ్నించిన వారిపై దాడులు, కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంచితే. అసలు జగన్ ఎప్పుడు ఎస్ ఐని కొట్టారనేది అంతా చర్చించుకుంటున్నారు. జగన్ గతంలో ఎన్నో అవినీతి ఆరోపణల్లో ఉన్నారు. ఆయనతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, సివిల్ సర్జెంట్లు కూడా జైలు పాలయ్యారు. ఎన్నో ఆరోపణలు ఉన్న జగన్ పై కేసులు కొంతకాలంగా ముందుకు వెళ్లడం లేదు. కారణమేదైనా సీఎం అయ్యాక జగన్ కేసుల్లో విచారణకు కూడా హాజరు కావడం లేదు. అయితే తాజాగా పవన్ వ్యాఖ్యలు ఏపీలో కాక రేపుతున్నాయి.
అయితే జగన్ గురించి పౌర హక్కుల నేత హరగోపాల్, రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఒక సంచలన విషయం బయటపెట్టారు. జగన్ అక్రమాలు పెరుగుతున్నాయని తండ్రి, సీఎం అయిన రాజశేఖర్ దృష్టికి అప్పట్లో పౌర హక్కుల నేతలు తీసుకెళ్లారు. అయితే అప్పట్లో జగన్ కు కొంతమంది అనుచరులు ఉండేవారు.
అందులో ఒకరు లైసెన్స్ లేని తుపాకిని కలిగి ఉన్నారు. దీంతో ఓఎస్ఐ అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. 24 గంటలు దాటినా కోర్టులో హాజరు పరచలేదు. అయితే వైఎస్ జగన్ ఆ స్టేషన్ కు వెళ్లి ఎస్సై ని కొట్టాడు. ఇది వాస్తవమేనని కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్లు హరగోపాల్ తెలిపారు. అయితే పౌర హక్కులు తెలిసే జగన్ అలా స్పందించాడని, వైయస్ వ్యంగ్యంగా మాట్లాడినట్లు పౌర హక్కుల నేతలు తెలిపారు. నిజంగానే ఎస్సై 24 గంటలు దాటినా నిందితుని కోర్టులో హాజరుపరచలేదా.. అన్నది మాత్రం తెలియదు.
అయితే ఒక ఎస్సై ని కొట్టడం బాధ్యత కలిగి ఉంటుందా అనేది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ సమయంలో స్పందించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రొఫెసర్ హరగోపాల్ ఇంటర్వ్యూలు పదేపదే చూపిస్తూ జగన్ పోలీసులను కొట్టేవాడని గుర్తు చేస్తుంటారు సీఎంగా జగన్ ఇప్పుడు కూడా పులివెందుల పంచాయతీలను అసెంబ్లీలో నడిపిస్తున్నాడని, రాష్ట్రవ్యాప్తంగా అదే రౌడీ రాజ్యం కొనసాగిస్తున్నారని మండిపడుతుంటారు. తాజాగా పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది.