MLC Kavitha : ఎమ్మెల్సీ కవితపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
దీంతోపాటు ఐదు లక్షల రూపాయల వరకు జరి మానా ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే ఆమె ఎమ్మెల్సీ పదవినీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పి ఎం ఎల్ ఏ చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం 2002లో రూపొందించింది.
ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజులపాటు కవితను విచారించేందుకు ఈడి అధికా రులకు అనుమతించింది. నిన్న ఈ అంశంపై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈడి నిబంధనలు పాటించకుండా అక్రమంగా కవితను అరెస్టు చేసిందని తమకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాదులు వాదించారు.
అయితే మనీలాండరింగ్ కేసులో ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సి ఉందని దర్యాప్తు కొన సాగాలంటే కవితని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు ఈడి అధికారులు తెలపడంతో జడ్జి వారం రోజులపాటు విచారించేందుకు అనుమతి మంజూరు చేశారు.