Komatireddy Fire : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి ఒక్కసారిగి ఫైర్ అయ్యారు. ఇంతక ముందెన్నడూ లేని స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఎవర్రా బానిసలంటూ ఊగిపోయారు. బీఆర్ఎస్ లో వేరేవాళ్లు సీఎం అవుతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైల్ అవుతున్నాయి.
ముఖమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. ఎవడిదిరా బానిసత్వ పార్టీ అంటూ కేటీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ పేరుతో కేటీఆర్ లక్షల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు చేశారు. కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానుకోవాలని.. సోనియా గాంధీపైనా, కాంగ్రెస్ పైనా నోరు పారేసుకోవద్దని కేటీఆర్ కు హితవు పలికారు.
”నాడు సోనియాతో గ్రూప్ ఫొటో కూడా దిగినవ్ కదా కేటీఆర్. ఇంకోసారి సోనియాపై మాట్లాడితే పాపం తగులుతుంది. కేటీఆర్.. రాజకీయాల్లో నీకేం అనుభవం ఉంది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావు. రెండో దశ ప్రారంభం కాగానే వచ్చావు. కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ రాలేదని కేటీఆర్ తెలుసుకోవాలి” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీలో మాట్లాడిన మాటల రికార్డులను కేటీఆర్ వినాలి. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. పిల్లల మరణాలకు చలించి సోనియా తెలంగాణ ఇచ్చారు. సోనియా, కాంగ్రెస్ పై విమర్శలు చేయడం కేటీఆర్ కి తగదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒకటో తారీఖున పింఛన్లు వచ్చేవి. ప్రభుత్వం ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిందో చెప్పాలి. ఎన్నికలు వస్తున్నాయనే పాలమూరు ప్రాజెక్టు ప్రారంభిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారు. బీఆర్ఎస్ లో అలా కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కేసీఆర్, తర్వాత కేటీఆర్, ఆ తర్వాత హిమన్షు ముఖ్యమంత్రి అవుతాడు. మా చెల్లిని అరెస్ట్ చేయకండి. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోండి అని కేటీఆర్.. అమిత్ షాకి చెప్పి వచ్చారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి? దళితబంధు, బీసీ బంధులో అక్రమాలపై కోర్టుకు వెళ్తున్నా” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.