KTR : 16 మీడియా సంస్థలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది లీగల్ నోటీసులు జారీ చేశారు. రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన డ్రగ్ దందా సూత్రధారి రాజేంద్రప్రసాద్ పాకాల అంటూ పలు మీడియా సంస్థలు వార్తల ప్రసారం చేశాయి. దీంతో రాజేంద్రప్రసాద్ 16 మీడియా ఛానళ్లకు నోటీసులు జారీ చేశారు. ఒక్కో మీడియా సంస్థకు ఏకంగా 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
ఇటీవల రాదిసన్ హోటల్ లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. ఈ కేసులు చాలామంది ప్రముఖులు ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నా రు.
ఆరోజు పార్టీలో పాల్గొన్న వ్యక్తులకు సిసి ఫుటేజ్ ఆధారంగా నోటీసులు కూడా జారీ చేశారు. నేపథ్యంలో పలు మీడియా సంస్థలు కేటీఆర్ బామ్మర్ది ఆధ్వర్యంలోనే డ్రగ్స్ దందా జరుగుతుందని న్యూస్ ను టెలికాస్ట్ చేయడంతో రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరువు నష్టం దావ వేశారు.