KTR Tweet : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో టిడిపి అధినేత చంద్ర బాబు బిజెపిని తిడుతూ 2019లో చేసిన ఓ ట్వీట్ ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.
సిబిఐ, ఈడి వంటి సంస్థలను ప్రతిపక్ష నేతలని హింసించేందుకు కేంద్రం వాడుకుంటుందని అప్ప ట్లో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ఇం కెంత దిగజారుతుందంటూ అప్పుడు ప్రశ్నించారు. దాన్నే రీ ట్వీట్ చేసిన కేటీఆర్, పరిస్థితిని తాను అంతకంటే చక్కగా చెప్పలేదని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో తెలంగాణలో రాజకీ యం ఒక్కసారిగా వేడెక్కింది. నిన్న మొన్నటి వరకు కేవలం నోటీసులు ఇచ్చిన అధికారులు ఒక్కసారిగా అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ పార్టీని దెబ్బ కొ ట్టాలను ఉద్దేశంతో బిజెపి అన్యాయంగా కవితలు అరెస్ట్ చేసిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టి చేసే రాజకీయం ఒక రాజకీ యమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.