Mass Beauty : ‘టైగర్ నాగేశ్వర్ రావు’గా రవితేజ త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. గతంలో పంచాయతీలు, గొడవలు జరిగినా.. అవన్నీ సమసిపోయి ప్రస్తుతం టీమ్ ప్రమోషన్ వర్క్ లో బిజీగా ఉంది. ఇందులో కథానాయిక పాత్ర గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తున్నారని గతంలో మేకర్స్ చెప్పుకచ్చారు.
వీరు కాకుండా రీసెంట్ గా ఒక లేడీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. కోలీవుడ్ కు చెందిన ఆమె మాజీ మిస్ ఇండియా కూడా.. ఆమె ఎవరంటే అనుకీర్తి వ్యాస్. ఇందులో ‘జయవాణి’ అనే పాత్రలో ఆమె కనిపించనుంది. తెలుగులో అనుకీర్తిది ఇది ఫస్ట్ ఫిల్మ్ కాగా.. కోలీవుడ్ లో ఒక సినిమా చేసింది. విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ‘డీఎస్పీ’లో అనుకీర్తి వ్యాస్ నటించింది.
గతం (2018)లో ‘ఫెమీనా మిస్ ఇండియా’ టైటిల్ ను దక్కించుకుంది అనుకీర్తి వ్యాస్. ఇప్పుడు స్ట్రయిట్ తెలుగులో సినిమా చేసింది. తమిళ కథానాయకిగా కనిపించే అనుకీర్తికి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నాయని పరిశీలకులు చెప్తున్నారు.
ఇటీవల విడుదలైన ‘టైగర్ నాగేశ్వర్ రావు’ టీజర్ హ్యూజ్ వ్యూవ్స్ తో దూసుకెళ్లింది. రాజకీయాల్లో ఉంటే ఎన్నికల్లో గెలిచేవాడు.. స్పోర్ట్స్ లో ఉంటే గోల్డ్ మెడల్ తెచ్చేవాడు.. ఆర్మీలో ఉంటే యుద్ధం గెలిచేవాడు.. కానీ దురదృష్ట వశాత్తు క్రిమినల్ అయ్యాడు’ అని టీజర్ లో చెప్పి సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది టీమ్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ లో మూవీ రాగా.. ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2, ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన సంస్థ దీన్ని నిర్మిస్తుంది.
టైగర్ నాగేశ్వర్ రావుకు వంశీ దర్శకత్వం వహించారు. ఈ రోజు (అక్టోబర్ 3)న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇందులో రవితేజ స్టువర్టుపురం నగేశ్వర్ రావు గా కనిపించనున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.