Under River Metro train India : మనిషి తన మేథస్సుతో ఎన్నో ఆవిష్కరిస్తున్నాడు. పక్షిలా ఎగరడం నేర్చుకున్నాడు. చేపలా ఈదడం తెలుసుకున్నాడు. ప్రస్తుతం సముద్ర గర్భాల్లో నదుల లోపలకు కూడా వెళ్లే మార్గాలు కనుగొంటున్నాడు. ఈనేపథ్యంలో కలకత్తాలోని హుగ్లీ నది కింద 33.5 మీటర్ల లోతున మొట్ట మొదటి ట్రైనీ ప్రయోగాత్మకంగా పరుగులు తీసింది. భారత్, అతుల్య భారత్, విశ్వ గురు, భారత్ వంటి మార్గాల్లో రైలు పరుగెత్తింది.
నదీ కింద మార్గంలో రైలు మార్గం వేయడం ఇదే తొలిసారి. ఈ రైలు మార్గంతో ప్రజలకు దూరభారం తగ్గుతోంది. హుగ్లీ నది కింద సొరంగ మార్గం ద్వారా దేశంలోనే మొదటిసారి రైలు ప్రయాణం చేసి చరిత్ర లిఖించింది. ఇంతవరకు నది కింద రైలు మార్గం వేయలేదు. ఇదే ప్రథమం కావడంతో అందరు ఎంతో ఉత్సాహంగా ఫీలయ్యారు.
ర్యాక్ నంబర్ ఎంఆర్ -612లో మహాకరణ్ నుంచి హౌరా స్టేషన్ కు రైలులో ప్రయాణించారు. బుధవారం ఉదయం 11.55కి హుగ్లీ నదిలో ప్రయాణించింది. హౌరా మైదాన్ నుంచి ఎస్న్లా నేడ్ వరకు నీటి అడుగున సొరంగంలో రైలు ప్రయాణం వచ్చే ఏడు నెలల పాటు సాగుతుంది. ఈ మార్గంలో సాధారణ సేవలు ప్రారంభమవుతాయి.
ఈ మెట్రో మార్గంలో భూగర్భ మార్గం 4.8 కిలోమీటర్లు ఉంటుంది. ఉపరితలం నుంచి 33 మీటర్ల (108 అడుగుల లోతు) దిగువన ఉంటుంది. భారతదేశపు లోతైన మెట్రో స్టేషన్ ఇదే. మెట్రో రైలు 45 సెకన్లలో హుగ్లీ నది దాటుతుంది. నదిలో 520 మీటర్ల విస్తీర్ణంలో సొరంగం నిర్మించారు. నీటి మట్టానికి 32 మీటర్ల దిగువన ఈ సొరంగం ఏర్పాటు చేశారు.