MLC Kavitha in Delhi Liquor Sam :
తెలంగాణ సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పూర్తి ఆధారాలు దొరికినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురు అప్రూవర్లుగా మారినట్లు సమాచారం. దీంతో కవితపై పలు విషయాలు వెల్లడైనట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో పూర్తి వివరాలను ఈడీ చార్జిషీట్లలో నమోదు చేసినట్లు సమాచారం. ఇందులో పాత్రధారులుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, దినేశ్ అరోరా, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, ఇక ఆమె బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా ఈ కేసులో అప్రూవర్లుగా మారినట్లు తెలుస్తున్నది. ఇక ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
మరోవైపు ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కూడా పూర్తిస్థాయిలో పాత్రధారిగా ఉన్నట్లు ఈడీ కి ఇచ్చిన స్టేట్ మెంట్ లో అప్రూవర్లు చెప్పినట్లుగా తెలుస్తున్నది. కవిత టీంతో కలిసి పనిచేయాలని అరవింద్ కేజ్రివాల్ చెప్పినట్లుగా సమాచారం. ఇందులో వందల కోట్లు చేతులు మారినట్లుగా ఈడీ గుర్తించింది. ఇక ఈ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసొడియా ఇంకా జైలులోనే ఉన్నారు.
ఇక ఎన్నికల సమయంలో కవిత అరెస్ట్ తర్వాత లబ్ధి పొందాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. రెండు నెలల పాటు కవిత జైల్లో ఉంటారని, ఆయనే స్వయంగా అంతరింగికులతో మాట్లాడుతున్నారని సమాచారం. ఆయనకు పక్కా సమాచారం ఉన్నందునే సీఎం కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని టాక్. అయితే సుప్రీంకోర్టు అక్టోబర్ 6 తర్వాత తీర్పు అనంతరమే కవితపై చర్యలకు ఈడీ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.