Independence Day 2023 : ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరికొత్త పథకాన్ని ఆవిష్కరించారు. మువ్వన్నెల రెపరెపల సాక్షిగా దేశ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. రూ. లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ స్కీమ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
విశ్వకర్మ యోజనం
విశ్వకర్మ జయంత్రి సందర్భంగా విశ్వకర్మ యోజన అనే కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల నుంచే ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పారు. తొలి విడుతగా రూ. 13 వేల కోట్ల నుంచి రూ. 15 కోట్లు ఇందు కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. అదేవిధంగా జనరిక్ ఔషధ కేంద్రాలను 10 వేల నుంచి 25 వేలకు పెంచుతున్నట్లుప్రధాని ప్రకటించారు. మార్కెట్ లో రూ. 100 కు దొరికే మందులు జన ఔషధి కేంద్రాల్లో రూ. 10-15 కే లభిస్తాయని చెప్పారు.
అయితే ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్లీ అధికారంలోకి వస్తానని చెప్పారు. నాకుటుంబం ప్రజలే. వారి గురించే ఆలోచిస్తా. మీ రు అండగా నిలిస్తే వచ్చే పంద్రాగస్టున కూడా ఇక్కడ నేనే జెండా ఎగిరేస్తా అంటూ మోదీ చెప్పుకొచ్చారు. దేశం అభివృద్ధిలో వచ్చే ఐదేండ్లు చాలా కీలకమని చెప్పారు. 2047లో భారత్ వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుంది. నాటికి అభివృద్ది చెందిన దేశంలో భారత్ ఉండాలనేది తన సంకల్పమని చెప్పుకొచ్చారు. అవినీతికి, వారసత్వరాజకీయాలకు వ్యతిరేకంగా అంతా యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.