NRI TDP : ఏపీ భవిష్యత్ కోసం ఎన్నారైలు కదిలివస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తరలివస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి ప్రదాతను, ప్రగతి సారథి నారా చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని నిర్ణయించుకున్నారు.
ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఎన్నారైలుగా తమ వంతు పాత్ర పోషించనున్నారు. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులకు సహకరించనున్నారు. ‘సైకిల్’ గుర్తుకు ఓటు ఎందుకు వేయాలో..టీడీపీని అధికారంలోకి ఎందుకు తీసుకురావాలో ప్రజలను చైతన్యవంతులను చేయనున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీకి చేసిందేమీ లేదని ఎన్నారై టీడీపీ విమర్శిస్తోంది. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చింది లేదని, ఉపాధి కల్పన ఊసే లేదని, నిరుద్యోగం పెరిగిపోయిందని..వారు ఆరోపిస్తున్నారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, ప్రైవేట్ రంగంలో ఉపాధి లేక నైరాశ్యంలో మునిగిపోయారని ఆవేదన చెందారు. ఏపీ ప్రగతిపథంలో ముందుకెళ్లాలంటే చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాల్సిందేనని వారు కోరుకుంటున్నారు. ఆమేరకు తాము సమాయత్తం అవుతున్నారు..
ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ కోఆర్డినేటర్లను నియమిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలోని ప్రవాసుల్లో కీలకపాత్ర పోషిస్తున్న వారిని గుర్తించి ఈ నియామకాలను చేస్తున్నారు. తాజాగా మరో విడత లిస్ట్ ను ఆయన విడుదల చేశారు. వీరందరూ వచ్చే 2024 ఎన్నికల్లో వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో పార్టీ అభ్యర్థుల విజయానికి సహాయపడనున్నారు.
రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేవిధంగా, అధినేత చంద్రబాబు నాయుడును మరోసారి ముఖ్యమంత్రిని చేసే లక్ష్యం కోసం వీరు పనిచేస్తారు. దీని కోసం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యాచరణ రూపొందించనున్నారు.
ఈసందర్భంగా వీరందరికీ ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి అభినందనలు తెలిపారు. వీరందరూ వచ్చే ఆరు నెలలు ఏపీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.