NTR 28th Vardhanthi :
శక పురుషుడు, మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావును స్మరించుకోవడమే గొప్ప ఆనందమని యూ బ్లడ్ ఫౌండర్, జై స్వరాజ్య టీవీ గ్లోబల్ అడ్వయిజర్ డాక్టర్ జై, జగదీష్ బాబు యలమంచిలి గారు అన్నారు. న్యూ జెర్సీ, ఎడిషన్ లో జైస్వరాజ్య టీవీ ఆఫీస్లో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు ఆయన నివాళులర్పించారు. యూ బ్లడ్, జై స్వరాజ్య గ్లోబల్ టీవీకి సంబంధించిన చాలా మంది ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
జగదీష్ బాబు గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు వారు కావడం గర్వకారణం అన్నారు. ఆయన ప్రతీ అడుగు, ప్రతీ మాట స్ఫూర్తి దాయకం అన్నారు. బాల్యం నుంచి తాను ఆయన సినిమాలు చూస్తూ, ఆయన స్పీచ్ లు వింటూ పెరిగానని అన్నారు. ఆయనతో పాటు కార్యక్రమానికి వీచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్ప తనాన్ని జగదీష్ బాబు గారు చెప్తుంటే మరింత గొప్పగా అనిపిస్తుందన్నారు.
ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవని వేనోళ్ల పొగిడించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖులను ఆకట్టుకున్నాయి. ఎడిసన్ కు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహా మనిషి గురించి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి చిత్రాలు ఇక్కడ చూడవచ్చు.
.
More Images : NTR 28th Vardhanthi ny UBLOOD Click Here
All Images Courtesy by Dr. Shiva Kumar Anand