H-1B Visa : అమెరికాలో పని చేసే వృత్తి నిపుణుల కోసం జారీ చేసే H-1B వీసాలను ఆ దేశంలోనే పునరుద్ధరించనున్నారు. దీనికి వైట్ హౌజ్ కు చెందిన నియంత్రణ సంస్థ ఓఐఆర్ఏ ఈ నెల 15వ తేదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. H-1B వీసా సాధారణంగా మూడేళ్లకు ముగుస్తుంది. దీని తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీసాదారులు వారి స్వదేశానికి వెళ్లడమో మరో ఇతర దేశం వెళ్లడమో చేసి అక్కడ పునరుద్ధరించుకోవాలి.
ఈ ఏడాది (2023) జూన్ లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో H-1B వీసా అమెరికాలోనే పునరుద్ధరిస్తామని బైడెన్ ప్రభుత్వం భారత ప్రధానికి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద 20 వేల వీసాలు పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేపట్టారు. H-1B వీసాలను కలిగి ఉన్న వారిలో భారత్ కు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో వారు నెలల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో ఇబ్బందులు తలెత్తున్నాయి.
ఈ విషయంలో అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ స్టఫ్ట్ భారతీయులకు స్థానికంగానే H-1B వీసాలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు నవంబరులో ప్రకటించారు. మొదటి విడుతలో అమెరికాలో ఉన్న 20 వేల మంది H-1B వీసా దారులు 20 వేల మంది వీసాలను డిసెంబర్ నుంచి మూడు నెలల్లో యూఎస్ లోనే పొండిగించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తో భారతీయులే ఎక్కువగా లబ్ధిపొందుతున్నారని అమెరికా వివరించింది.
H-1B వీసా స్థానికంగానే పునరుద్ధరిస్తామని అమెరికా చెప్పడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడేళ్లకు ఒకసారి ఇండియాకు వెళ్లాల్సి రావడం తప్పుతుందని అంటున్నారు. మోడీ ప్రభుత్వం చొరవకు వారు కృతజ్ఞతలు చెప్తున్నారు.