Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దానకి టీడీపీ విశేష ప్రజాదరణే నిదర్శనం అని పేర్కొన్నారు.
ఏపీలో జగన్ను మించిన పెత్తందారు మరోకరు లేరు.. జగనే ఇతరులను పెత్తందారులు అనడం హాస్యాస్పదమని అన్నారు. మైలవరాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో టీడీపే, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.