Independence Day 2023 : భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా మంగళవారం నిర్వహించారు. ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని కీలక ప్రసంగం చేశారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తన తొమ్మిదేళ్ల పాలనలో భారత కీర్తి పతాక మరింత రెట్టింపయ్యిందని చెప్పుకొచ్చారు..
అయితే కరోనా సమయంలో తమ ప్రభుత్వం తలవంచలేదని చెప్పుకొచ్చారు. దేశానికి కరోనా పెద్ద సవాల్ గా మారిన సంక్షోభ సమయంలోనూ సంక్షేమాన్ని ఆపలేదని తెలిపారు. పేదల ఇండ్ల కోసం 4 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం రైతులకు రూ. 10 లక్షల కోట్లు యూరియా సబ్సిడీ ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే నెలలో విశ్వకర్మ యోజనను ప్రారంభిస్తామని, ఈ పథకానికి 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని మోదీ చెప్పారు. గతంలో 13. 5 కోట్లు కుటుంబాలు దారిద్ర్య రేఖకు నుంచి బయట పడ్డాయని అన్నారు.
నేడు మనం ద్రవ్యోల్సణాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచం ద్రవ్యోల్పణంతో పోరాడుతున్న చోట, ద్రవ్యోల్పణాన్ని నియంత్రించడంలో విజయం సాధించాం అని ఘనంగా చెప్పారు. భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రగతిని అభివర్ణించారు. ప్రపంచదేశాలన్నీ నేడు భారత్ వైపు చూస్తు్న్నాయంటే నేడు తమ పాలనలో సాగుతున్న ప్రగతి మంత్రమే కారణమని చెప్పుకొచ్చారు. అయితే ఈసారి కూడా సామాన్యులకు కానుకగా పలు పథకాలను ఆయన ప్రవేశ పెట్టారు. వచ్చే ఐదేళ్లలో భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేసి చూపిస్తామని ప్రకటించారు.