భువనేశ్వర్: నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే 2024 లోక్సభ ఎన్నికలు భారతదేశంలో చివరి ఎన్నికలు అవుతాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం జోస్యం చెప్పారు. ఒడిశాలోని భువనే శ్వర్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ నియంతృత్వాన్ని ప్రకటిస్తారని పేర్కొన్నారు.”లోక్సభ ఎన్నికల తర్వాత మోడీ అధికారంలోకి వస్తే నియం తృత్వం ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు” అని ఖర్గే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరికి బిజెపి ఈడీ నోటీసులు ఇస్తూ బయపెట్టి రాజకీయలు చేస్తుందని ఆయన ఆరోపిం చారు. భయభ్రాంతులకు గురిచేయడం వల్లనే కొందరు దోస్తీలు వీడుతున్నారు, మరికొందరు పార్టీని వీడు తున్నారన్నారు. మరికొందరు కూటమిని వీడు తున్నారన్నారు.ఇదే మీకు చివరి అవకాశమని ఓటు వేయం డని దీని తర్వాత, ఓటింగ్ ఉండదని ఖర్గే అన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేయాలనుకుం టున్నారని, తాను ‘మొహబ్బత్ కీ దుకాన్’ ప్రారంభించానని చెప్పారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ ఎస్లు ‘నఫ్రత్కీ దుకాన్’కు తెరతీశాయి. ఈ కారణంగా మీరు అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు విషం, మన హక్కుల నుహరి స్తు న్నాయని ఖర్గే అన్నారు.