స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా బాలీవుడ్ పై బాంబ్ వేసింది. నేను హాలీవుడ్ కు వెళ్ళడానికి బాలీవుడ్ లో నెలకొన్న రాజకీయాలే ! అంటూ బాంబ్ పేల్చింది. బాలీవుడ్ లో కొంతమంది ఓ గ్రూప్ గా తయారయ్యారు ……. వాళ్ళు నాకు అవకాశాలు రాకుండా చేశారు. అంతేకాదు తరచుగా వాళ్లతో గొడవపడి , వాదనలకు దిగడం వ్యర్థమని అర్థమైపోయింది దాంతో ఆ రాజకీయాలు నావల్ల కాదని హాలీవుడ్ కు వచ్చానని అంటోంది ప్రియాంకా చోప్రా.
ఇప్పుడు ఈ భామ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో కూడా పలువురు నటీనటులు బాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువని , అలాగే ఎవరిని తొక్కాలో ఎవరిని లేపాలో వాళ్ళు లెక్కలు వేసుకుంటారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు తగ్గట్లుగా పలువురు నటీనటులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా కోకొల్లలు.
ఇక ఇటీవలే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కరణ్ జోహార్ అండ్ కో పై సంచలన ఆరోపణలు చేసింది. ప్రియాంకా చోప్రా బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు పారిపోవడానికి కరణ్ జోహార్ అండ్ కో కారణమని సంచలన ఆరోపణలు చేసింది. కట్ చేస్తే ప్రియాంకా చోప్రా నేను బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్ళడానికి బాలీవుడ్ లోని రాజకీయాలే అంటూ బాంబ్ పేల్చింది. అయితే కంగా స్టయిల్ లో కరణ్ జోహార్ గ్యాంగ్ పేర్లు నేరుగా చెప్పలేదు….. ఎందుకంటే అర్ధం కావాల్సిన వాళ్లకు అర్ధం అవుతుంది కదా ! మిగతావాళ్లకు అర్ధం కావాల్సిన అవసరం లేదని ఆమె భావన కావచ్చు.
బాలీవుడ్ నుండి వెళ్లిన ప్రియాంకా చోప్రా కు అక్కడ మంచి అవకాశాలే వచ్చాయి. అంతేకాదు నిక్ లాంటి భర్త కూడా దొరికాడు ప్రియాంకా చోప్రాకు దాంతో సంతోషంగా ఉంది. కాకపోతే బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించాలని ఆశగా ఉంది కానీ ఇక్కడ కొంతమంది గ్యాంగ్ గా మారి వాళ్లు చెప్పిన వాళ్లకు మాత్రమే అవకాశాలు వచ్చేలా చేస్తున్నారు కదా !