![Rashmi bold](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/05/rashmi-goutam.jpg)
Rashmi bold Comments : యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్.. ఈ జంటకు వెండితెర మీద హీరో హీరోయిన్ల జంటకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. బుల్లితెరపై ఈ జంట సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కావు.. జబర్దస్త్ ద్వారా ఈ జంట పాపులర్ అయ్యింది.. సుడిగాలి సుధీర్ కమెడియన్ గా రష్మీ యాంకర్ గా ఈ షో ద్వారానే బాగా పాపులర్ అయ్యారు.. వీరి మధ్య లవ్ ఉంది అనేంతగా ఆడియెన్స్ ను అలరించారు.
లవ్ ఉన్నా లేకపోయినా వీరి బాండింగ్ మాత్రం సూపర్ అనే చెప్పాలి.. వీరి మధ్య కెమిస్ట్రీ వల్లనే జబర్దస్త్ మరింత పాపులర్ అయ్యింది.. అంతగా ఈ జంట ఒకరిపై ఒకరు చూపించిన కెమిస్ట్రీ ప్రేమలో ఉన్నారేమో అనిపించేలా చేసింది.. అయితే ఇలా ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోయారు.. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోను విడిచి వెళ్లడంతో రష్మీ ఒంటరిగా మిగిలింది.
సుధీర్ దూరం అవ్వడంతో వీరి మధ్య బాండింగ్ కూడా దూరం అయ్యింది. ఒకరికొకరు బాగా దూరం అయ్యారు.. అయితే రష్మీకి మాత్రం సుధీర్ మీద ప్రేమ చావలేదు అని అనిపిస్తుంది.. అలా ఎందుకు అంటున్నాం అంటే తాజాగా ఈ బ్యూటీ స్టార్ మాలో ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న సిక్త్ సెన్స్ షోకు గెస్ట్ గా వెళ్ళింది.. బ్రహ్మాజీతో కలిసి ఈమె సందడి చేయగా ఇక్కడ ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఇందులో భాగంగా ఓంకార్ నువ్వు ఒంటరిగా ఐలాండ్ లో ఇరుక్కుపోతే ఏ టాలీవుడ్ హీరోను మీతో ఉండడానికి కోరుకుంటారు అని అడుగగా.. రష్మీ కాసేపు ఆలోచించి ఆ తర్వాత సుధీర్ కంపెనీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసింది. ఈ కామెంట్స్ విన్నీ సుధీర్ ఫ్యాన్స్ ఈమెకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం బయటకు వచ్చింది అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు.