![Sithakka](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/SEETHAKKA-jpg.webp)
Sithakka : మంత్రి పదవి నుంచి సీతక్కను తొలగించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి సీతక్కకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. ఎన్నికలు ముగిశాయి. రిజల్ట్ రావడంతో పార్టీలో కీలక పదవులను వివిధ నేతలకు అందించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వద్దే పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు కూడా ఉన్నాయి. ఎన్నికలు ముగియగానే తెలంగాణ పీసీసీ ని పార్టీలోని సీనియర్లకు అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తన కోటరీకే చెందిన సీతక్కకు పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే సీనియర్లు జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, భట్టి లాంటి వారు పోటీలో ఉన్నారు.
అయినా పీసీసీ అధ్యక్ష పదవిని సీతక్కకే అప్పగించనున్నారని తెలుస్తోంది. కానీ మంత్రి పదవి వేరే వ్యక్తికి ఇచ్చి పార్టీ బాధ్యతలు ఇవ్వడానికి అధిష్టానం చూస్తోందని అనుకుంటున్నారు. కానీ కొంతమంది మంత్రి పదవి ఉండి కూడా పీసీసీ బాధ్యతలు తీసుకోవచ్చని కోరుతున్నారు. సీతక్క మొదటి సారి తెలంగాణలో మంత్రి పదవి చేపట్టింది.
సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తాను సీఎం పదవి చేపట్టిన తర్వాత పార్టీలో కీలకంగా పని చేస్తున్నారు. అన్నింటా తాను సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు ఇలా నిర్ణయాలు తీసుకున్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని.. అచ్చం అదే విధంగానే పార్టీలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంతో రేవంత్ సత్సంబంధాలు ఉండడంతోనే ఆయనకు ఫ్రీ హ్యండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి తాను నిర్ణయాలు తీసుకుని తర్వాత అధిష్టానంకు తెలియజేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.దీంతో పార్టీలోని సీనియర్లకు ఈ విధానం నచ్చడం లేదని అందుకే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు వేరే వ్యక్తికి అప్పగిస్తే కొంతవరకైనా రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయొచ్చని అనుకుంటున్నారు.