‘Rukmini’ Kota Around Pawan Kalyan : జనసేన పార్టీలో ఇన్నాళ్లు నాదెండ్ల మనోహర్ మాట సాగేది. కానీ ప్రస్తుతం ఆయన పేరు కాకుండా రుక్మిణి జనసేనలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. పవన్ కల్యాణ్ ను కలవాలంటే ఆమె అనుమతి తప్పనిసరి. అందుకే జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రుక్మిణి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆమె పార్టీలో ప్రముఖంగా మారింది. ప్రస్తుతం ఆమె పేరు చెబితే పార్టీలోనే హడల్.
రాయలసీమ మహిళా నాయకురాలు పసుపులేటి పద్మావతి జనసేనకు రాజీనామా చేసింది. తన రాజీనామా లేఖలో 140 రోజులు తనను రుక్మిణి ఎలా ఆడుకుందో వివరించింది. ప్రస్తుతం జనసేన పార్టీలో రుక్మిణి పేరు చెబితే ఆఫ్ ది రికార్డు అని మాట్లాడుకుంటున్నారు. క్రిష్ణా జిల్లాకు చెందిన రుక్మిణి లండన్ లో ఉండేది. అక్కడ బట్టల దుకాణం నిర్వహించేది. పవన్ విదేశీ పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాట్లు చేసిన ఆమె పార్టీలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది.
2020లో జనసేన సెంట్రల్ అఫైర్స్ కమిటీ వైస్ చైర్మన్ గా నియమించారు. ఈనేపథ్యంలో ఆమె పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగింది. తరువాత హైదరాబాద్ కు మకాం మార్చడంతో పార్టీలో కీలక వ్యక్తిగా మారింది. ప్రస్తుతం నాదెండ్ల కంటే ఆమెకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. ఆమె అనుమతి లేనిదే పవన్ ను కలవడం అసాధ్యం. దీంతో రుక్మిణి కోట పవన్ కు రక్షణగా నిలుస్తోంది.
ఇప్పటికే పార్టీలో పనిచేసే 30 మందిని తొలగించారు. వారి స్థానంలో తనకు సంబంధించిన వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. పవన్ ను కలవాలంటే రుక్మిణిని దాటుకుని వెళ్లాలి. ఆమె పచ్చ జెండా ఊపితేనే పవన్ ను కలుసుకునే భాగ్యం దొరుకుతుంది. ఇప్పుడు నాదెండ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలో నాదెండ్ల స్థానంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.