- ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు
జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. జనసేన పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) ఫౌండర్, ప్రెసిడెంట్ సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. తాజాగా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నట్లు ఆదేశాలు జారీచేస్తూ గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది.