Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ పేరు ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా సుపరిచితమే.. దుల్కర్ సల్మాన్ మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు అని చాలా మందికి తెలుసు.. అయినా కూడా దుల్కర్ స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి తనకంటూ ప్రత్యేకమైన సినిమాలను ఎంచుకుంటూ చేసుకుంటూ పోతున్నాడు..
దుల్కర్ మహానటి సావిత్రి సినిమాలో జెమినీ గణేశన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యారు.. ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ స్ తర్వాత సీతారామం సినిమాతో గత ఏడాది వచ్చి ఇండియా వైడ్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ జంట ఈ సినిమాతో బాగా ఫేమస్ అయ్యారు..
అలా తన కష్టంతోనే ఈ స్థాయికి చేరుకున్నాడు. మలయాళంలో ఈ హీరో ముందు నుండే ఫేమస్.. కానీ మిగిలిన భాషల్లో మహానటి, సీతారామం సినిమాలే ఈయనకు పాన్ ఇండియన్ స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి.. మరి అలాంటి ఈ స్టార్ హీరో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
నాకు బాయ్స్ లోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.. అభిమానుల వల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి.. అమ్మాయిలు సెల్ఫీ పేరుతో బుగ్గ మీద ముద్దు పెట్టాలని కూడా చూసారు.. నేను ఆశ్చర్యపోయే వాడిని.. గతంలో ఒక పెద్దావిడ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను.. ఆమె నన్ను అభ్యంతరకరంగా తాకింది.. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.. అంటూ చెప్పుకొచ్చారు. ఈయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యింది.