Swimming Competitions : సికింద్రాబాద్ లో మున్సిపల్ (వీవీ గురుమూర్తి మెమోరియల్) స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆందోళన నెలకొంది. ఈరోజు (మే 23) గురువారం పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. అయితు, ఈ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వకుండా నిర్వాహకుడు జీఎస్ నటరాజన్ పారిపోయినట్లు విజేతలు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఒక్కొక్కరి నుంచి 15 వందల రూపాయలు తీసుకొని ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని పోటీలో పాల్గొన్నవారు తెలిపారు. తాగడానికి నీటిని కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు విజేతలకు పతకాలు కూడా ఇవ్వడం లేదని వారు ఆందోళనకు దిగారు. ఇలా చేయడం ఇది మూడవసారని చెప్పారు. గతంలో వారణాసి, నాసిక్ లో నిర్వహించిన పోటీలకు సంబంధించిన మెడల్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదని వారు ఆరోపించారు. ఈ పోటీల నిర్వాహకుడు పాన్ ఇండియా జీఎస్ నటరాజన్ పై పోటీదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.