T. Jeevan Reddy : తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి సతీమణికి 50 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయం ఎన్నికల అఫిడవిట్ లో జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ కాంగ్రస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన తన అఫిడవిట్ లో ఆస్తి వివరాలను వెల్లడించారు. ఆయన కుటుంబానికి రూ. 3.55 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయనకు ఇన్నోవా క్రిస్టా కారుతో పాటు 12.5 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు. ఇంకా ఆయన భార్యకు 50 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని వెల్లడించారు.
కాగా, ఆయనకు 68.38 లక్షల చరదాస్తులు, 35.24 ఎకరాల భూమి, జగిత్యాలలో ఇల్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. బ్యాంకులో రూ.58.14 లక్షల రుణాలు, 4 క్రిమినల్ కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారు.