Yoga Day 2023 : ప్రపంచ వ్యాప్తంగా ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారు. కేంద్రంలో 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యోగాకు ప్రాధాన్యమిస్తూ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. యోగాతో ఎన్నో ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయి. శారీరక, మానసిక , ఆధ్యాత్మికంగా యోగా మనిషికి మేలు చేస్తుంది. దీంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం చక్కటి వేదికగా పనిచేస్తున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ 2014 లో ఐకరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన తర్వాత అంతర్జాతీయ యోగాను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయతే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక థీమ్ తో నిర్వహిస్తున్నారు. యోగా ఫర్ వసుదైక కుటుంబం అని థీమ్ నిర్ణయించారు. ఒకే కుటుంబం.. ఒకే ప్రపంచం అనే అర్థంతో దీనిని నిర్వహిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ యోగా కార్యక్రమం ప్రస్తుత థీమ్ యొక్క స్పూర్తిని తెలియజేస్తున్నది. ఒక్క భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ రోజు యోగా డేను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
యోగా మానసిక సమస్యలకు చెక్ పెడుతుంది. మనిషిలో ఒత్తిడిని తగ్గించి, అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. మెదడుపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు శరీరానికి ఉన్న ఉన్న సంబంధాన్ని మెరుగు చేస్తుంది. అయితే జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా డే భిన్నమైన ప్రజలను ఏకం చేయడంలో చక్కటి వేదికగా నిలుస్తుంది. సామన్య ప్రజల నుంచి దేశ ప్రధాని, అధ్యక్షుల వరకు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రస్తుతం విదేశాల్లో యోగా ఎంతో ఆదరణ పెరుగుతున్నది. ప్రత్యేక శిక్షకులను, భారీ వేతనాలు చెల్లించి మరి నియమించుకుంటున్నారు. యోగాతో వస్తున్న సంపూర్ణ ఆరోగ్య ఫలితాలే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.