Urvashi Rautela :
ఐటెం సాంగ్ ల స్పెషలిస్ట్ ఊర్వశి రౌటేలా అంటే పాన్ ఇండియా వ్యాప్తంగా సుపరిచితమే.. ఈ భామ ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే మెరిసింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి వరుసగా ఐటెం సాంగ్స్ చేసుకుంటూ పోతుంది.. ముందుగా మెగాస్టార్ చిరుతో బాస్ పార్టీ సాంగ్ లో చిందేసి మెగా ఫ్యాన్స్ కు దగ్గరైంది.
ఇక ఆ తర్వాత అఖిల్ ఏజెంట్ సినిమాలో చిందేసింది.. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ లతో కలిసి బ్రో లో చిందేసి మరింత పాపులర్ అయ్యింది.. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఈ భామ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఏదొక కామెంట్స్ చేస్తుంది.
2013 నుండి బాలీవుడ్ లో రాణిస్తున్న ఈ బ్యూటీ ఎన్నో వివాదాల్లో సైతం చిక్కుకుంది. తన కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ తాజాగా మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఈమె చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేసిందంటే..
ఈమె ఒక ఈవెంట్ కు హాజరవ్వగా మీరు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్నారు? దీనిపై ఏం చెబుతారు? అని రిపోర్టర్ అడుగగా.. ”ఇది మంచి విషయం ప్రతీ సెల్ఫ్ మేడ్ నటుడు, నటి ఇలాంటి రోజును చూడాలని కోరుకుంటారు అని నేను భావిస్తున్నాను” అంటూ ఈమె చెప్పగా ఈ వీడియోను వైరల్ చేసేస్తూ కొందరు విమర్శిస్తున్నారు. నీకు నిముషానికి కోటి రూపాయలు ఎవరు ఇస్తున్నారు? అంటూ మామూలుగా ట్రోల్స్ చేయడం లేదు..