త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అనే చెప్పాలి. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.. మరి అలాంటి డైరెక్టర్ గురించి ఇప్పుడొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈయనకు సిరివెన్నెల సీతారామశాస్త్రి మామ గారి వరుస.. ఈయన భార్య సౌజన్య ఎక్కువుగా ఈయన ఇంట్లోనే పెరిగింది..
త్రివిక్రమ్ కు ఆమె భార్య పరిచయం అయ్యింది కూడా అక్కడే.. ఈ సంబంధం కుదిర్చి త్రివిక్రమ్ పెళ్లి చేసింది కూడా సిరివెన్నెలే.. మరి అలాంటి కుటుంబం కష్టంలో ఉంటే త్రివిక్రమ్ ఏ మాత్రం పట్టించుకోలేదు.. కష్టంలో ఉన్నప్పుడు సిరివెన్నెల ఫ్యామిలీని ఆదుకుంది వైఎస్ జగన్ ప్రభుత్వమే.. సిరివెన్నెల ఆసుపత్రిలో ఉన్నప్పుడు లక్షల ఖర్చును ఏపీ ప్రభుత్వమే భరించింది.
అలాగే సిరివెన్నెల మరణించిన తర్వాత కూడా వైజాగ్ లో ఆయనకు విలువైన స్థలాన్ని కేటాయించింది. అయితే జగన్ ప్రభుత్వం ఇన్ని చేసిన కూడా కృతజ్ఞత ఏ మాత్రం చూపించలేదు త్రివిక్రమ్.. కనీసం థాంక్స్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. అయితే తెలంగాణ మీద మాత్రం ఆయన తాజాగా ప్రశంసలు కురిపించాడు.. కేసీఆర్ పట్ల అభిమానాన్ని చూపిస్తూ తెలంగాణ గురించి ఆయన ప్రభుత్వం గురించి నాలుగు మాటలు చెప్పారు.
ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ.. అదే అభిమానం, ఆదరణ ఏపీ ప్రభుత్వం మీద లేకపోవడం గురించి చర్చ జరుగుతుంది.. మరి ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని త్రివిక్రమ్ బావిస్తున్నాడో తెలియదు.. కనీసం పైన మామగారు సిరివెన్నెల పట్ల ఏపీ ప్రభుత్వం చేసిన సాయంకైనా ఒక మంచి మాట అనాలి అనో చిన్న అభినందన తెలపాలని ఆయనకు అనిపించలేదేమో.. లేదా అయన ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటే ఆయన స్నేహితుడు పవన్ కు కోపం వస్తుందేమో అని ఆగిపోయారేమో అని రకరకాల ఊహాగానాలు మాత్రం వస్తున్నాయి..