దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి దాంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈరోజు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖాధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. టెస్ట్ లు పెంచాలని , అలాగే కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలనీ ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ముఖ్యంగా కర్ణాటక , గుజరాత్ , మహారాష్ట్ర రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు 1890 దాంతో కరోనా టెస్ట్ లు వేగవంతం చేయాలని కోరింది.
Breaking News