దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. కరోనా టెస్ట్ లు వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం. గుజరాత్ , మహారాష్ట్ర , కర్ణాటక , తమిళనాడు లలో కరోనా కేసులు భారీ ఎత్తున నమోదౌతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1590 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ బీబీ 1. 16 విజృంభణ వల్లే కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయని కేంద్రం భావిస్తోంది.