సమంత నటించిన శాకుంతలం చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. ఏప్రిల్ 14 న భారీ ఎత్తున శాకుంతలం చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఇమాక్స్ లో మాత్రం ఈరోజు షోలు పడలేదు. అందుకు కారణం ఏంటో తెలుసా…….. ఏప్రిల్ 14 న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కావడంతో హుస్సేన్ సాగర్ జలాశయం పక్కనే 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండటంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు విధించింది. ఆంక్షల నేపథ్యంలో ఆ రూట్ లలో ట్రాఫిక్ వెళ్లకుండా చర్యలు చేపట్టింది ట్రాఫిక్ పోలీస్ విభాగం.
అదే ఏరియాలో ప్రసాద్స్ ఇమాక్స్ ఉండటంతో ఈరోజు షోలు క్యాన్సిల్ చేశారు. దాంతో క్యాన్సిల్ అయిన డబ్బులను ప్రసాద్స్ ఇమాక్స్ ప్రేక్షకులకు ఇవ్వనుంది. అయితే రాత్రి షోలు మాత్రం యధావిధిగా పడనున్నాయి. శాకుంతలం సినిమా విడుదల అవ్వడం అలాగే షోలు పడి టాక్ బయటకు రావడంతో ఇక ఈ సినిమా పుంజుకోవడం కష్టమే అని అంటున్నారు. శాకుంతలం సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది.