33.7 C
India
Sunday, June 16, 2024
More

    Praveen Prakash : ఉదయం ఆలస్యం.. సాయంత్రం ముందే వెళ్లిపోతున్నారు – ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్

    Date:

    Praveen Prakash
    Praveen Prakash

    Praveen Prakash : ఉదయం బడికి ఆలస్యంగా వచ్చి.. సాయంత్రం ముందే వెళ్లిపోతున్నారని, జీతాలు రూ.లక్షల్లో తీసుకుంటున్నా, ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని, ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రశ్నించారు. శనివారం రాత్రి పశ్చిమ గోదావరి  జిల్లాలోని తణుకు ఎన్టీఆర్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

    పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ బడులు 20 శాతం వెనుకబడి ఉన్నాయన్నారు. క్వాలిఫైడ్ ఉపాధ్యాయులున్నా పరీక్షల్లో ఫలితాలు సరిగా రాకపోవడానికి నిర్లక్ష్యమే కారణమని, రూ. కోట్లు ఖర్చు పెట్టి సౌకర్యాలు కల్పిస్తున్నా ఫలితాలు మెరుగుపడటం లేదని అన్నారు. ఉదయం ఆలస్యంగా వచ్చి సాయంత్రం మాత్రం నిర్దేశిత సమయం కంటే ముందే వెళ్లిపోతున్నారని, ఒక్కో ఉపాధ్యాయుడికి సగటున 20 నుంచి 25 మంది పిల్లలే ఉంటున్నారని, కనీసం ఒక ఉపాధ్యాయుడు 50 మంది పిల్లలను చూడలేరా? అని ప్రశ్నించారు. ఆరవ తరగతి నుంచే విద్యార్థులకు ప్రతి యూనిట్ లో 70 శాతం మార్కులు వచ్చేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయాలు ఆయనను కలిసి మూడు నెలలుగా జీతాలు రావడం లేదని తెలుపడంతో మూడు రోజుల్లో చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

    Share post:

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YCP Govt : విద్యార్థుల తల్లులకు నోటీసులు పంపిన వైసీపీ ప్రభుత్వం

    YCP Govt : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆపద్ధర్మ వైసీపీ ప్రభుత్వం...

    AP Schools : ఏపీలో మధ్యాహ్నం 12:30 వరకే స్కూళ్లు

    AP Schools : ఈనెల 18 నుంచి ఒంటిపూట బడులు నిర్వ హణకు...

    Jagan : విద్యకు పైసలేవు..అప్పుల్లో ముంచిన జగన్..

    Jagan : ఏపీలోని పాఠశాల విద్యాశాఖ నిధుల లేమితో కటకటలాడుతోంది. ప్రతి...

    Botsa Sathyanarayana : బొత్స.. నిరుద్యోగులపై అంత చిన్నచూపు ఏంటయ్యా!

    Botsa Sathyanarayana : మంత్రి బొత్స సత్యనారాయణ సీనియర్ నేత. గతంలో...