గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్పై కోడికత్తితో హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ విశాఖ సెంట్రల్ జైల్లో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. అతడి దీక్షకు విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కోడికత్తి శ్రీనుతో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బూసి వెంకట్రావు ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జలపల్లి శ్రీనివాస్ ఈ ఉదయం అల్పాహారం కూడా తీసుకోలేదని, తన దీక్షకు భగ్నం కలగకుండా కావలసిన అనుమతులు ఇప్పించాలని కోరుతున్నాడని చెప్పారు.
జైల్లో తన కొడుకు శ్రీను,ఇంట్లో నేను, నా పెద్ద కుమారుడు నిరాహార దీక్ష చేస్తున్నామని అన్నారు. పోలీసు అనుమతులు లేని కారణంగా ఇంట్లోనే దీక్ష చేస్తున్నామని, సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. శ్రీను ప్రాణం ఉన్న అంబేడ్కర్ వారసుడ్ని జైల్లో పెట్టించిన జగన్.. ప్రాణం లేని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం దళితులకు చేస్తున్న ద్రోహమని కోడి కత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కొలువైన కనక దుర్గమ్మ, గుణదల మేరీమాత మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.
రెండు రోజులుగా ధీక్ష చేస్తున్న శ్రీను కుటుంభ సభ్యులు నేడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు – కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. కోడి కత్తి కేసులో జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.