Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవిత, సీఎం కూతురి పేరు కనిపించలేదు. అయితే గతంలో ఈ స్కాంలో కవితను ఈడీ అధికారులు విచారించారు. ఆ సమయంలో రాష్ట్రంలో గందరగోళం నెలకొంది. దాదాపు మూడు సార్లు ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ స్కాంకు కవితకు సంబంధం ఉందని అప్పట్లో జోరుగా చర్చలు వినిపించాయి. దీనికి తోడు తెలంగాణ బీజేపీ నాయకులు కూడా కవిత ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది అంటూ చెప్పారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన దాదాపు 5700 పేజీల చార్జిషీట్ లో కవిత పేరు కనిపించలేదు. 89 మందిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు ప్రముఖంగా మనీశ్ పిసోడియాతో పాటు మరికొంత మంది పేర్లను మాత్రమే చేర్చింది. అయితే గత సంవత్సరం డిసెంబర్ లో ఈడీ కవితను ప్రశ్నించింది. ఈ విషయాన్ని కూడా చార్జి షీట్ లో ఎక్కడా చేర్చలేదు. దీంతో రాష్ట్రంలో ప్రత్యేక చర్చ వినిపిస్తుంది. కేసీఆర్, మోడీ ఒక్కటయ్యారని అందుకే కవితను స్కాం నుంచి తప్పించారని. కానీ, కవిత మొదటి నుంచి చెప్తున్నట్లుగానే తనకు లిక్కర్ స్కాంకు ఎలాంటి సంబంధం లేదన్న వాదనలకు బలం చేకూరుతుంది.
సీబీఐ మేలో కోర్టుకు దాఖలు చేసిన 5700 పేజీల చార్జిషీట్ లో కవిత పేరు ఎక్కడా లేదని, ఆమె హైదరాబాద్, ఢిల్లీలోని హోటళ్లలో మనీస్ సిసోడియాతో సమావేశమైనట్లు ఆధారాలు ఉన్నాయన్న అధికారులు ఆ వివరాలను చార్జిషీట్ లో ఎందుకు చేర్చలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, మోడీపై ట్రోల్స్ మొదలయ్యాయి. కవిత పెదనాన్నగా మోడీని సంభోదిస్తూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ లాలూచీ పడ్డాయని అందుకు ఇదే నిదర్శనమని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కవిత ఈ స్కాం నుంచి తొలగించడంపై చాలా మందికి అనుమానాలు రేకెత్తుతున్నాయి.