ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఇప్పుడు ఇదే ఫార్మూలాను ఫాలో అవుతున్నారు టాలీవుడ్ హీరోలు. అందుకే ఒకే స్టార్ డమ్ ఉన్న హీరోలు కలిసి పని చేసేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఈ ఫార్మూలాను అప్లై చేసి చాలా మంది హీరోలు రేస్ లో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పటి వరకు అలాంటి రిస్క్ చేయని నందమూరి నటసింహంతో ఓ యంగ్ డైరెక్టర్ ప్రయోగం చేసేందుకు రెడీ అవుతుండటం హాట్ టాపిక్ గా మారింది.
బాలకృష్ణ, పవన్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. ఆ విధ్వంసాన్ని ఊహించుకోవడం కష్టం కూడా. అసలు ఈ కాంబినేషన్ లో సినిమాను ఎవరూ ఎక్స్ పెక్ట్ కూడా చేయలేరు.. కానీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని మాత్రం.. ఈ కాంబోపై తాజాగా ఓ బిగ్ బాంబ్ పేల్చాడు . మమ్ముట్టి, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన దళపతి సినిమా ని రీమేక్ చేస్తే ఎవరితో చేస్తారని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. ఆయన చెప్పిన అన్సర్ ఆసక్తికరంగా మారింది.
మమ్ముట్టి పాత్రకు తాను ముమ్మాటికీ బాలయ్యని తీసుకుంటానని చెప్పాడు. అయితే రజనీకాంత్ పాత్రలో ఎవరిని తీసుకుంటారని.. పవన్, ఎన్టీఆర్ అనే ఆప్షన్స్ ఇవ్వగా, గోపీచంద్ మలినేని పవన్ కళ్యాణ్నే తీసుకుంటానని చెప్పి ఆశ్చర్యపరిచాడు. దీంతో ఆయన మాటలు విన్నవారంతా నిజంగానే ఆ అవకాశం వస్తే బాగుండని అనుకుంటున్నారు. కానీ అందరి మైండ్ లో రిజిస్టర్ అయిన సినిమాని మళ్లీ ప్రేక్షకులు ఆదరిస్తారా అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. కానీ బాలయ్య -పవన్ ఒకే ఫ్రేం లో కనిపిస్తే… అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ గా ఉంటుందనే చెప్పాలి.