Viral News : ఏపీ ఎన్నికల్లో ఒక్కో చోట ఒక్కో ఘటన చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళను కిడ్నాప్ చేసిన ఘటన ఈ రోజు (ఏప్రిల్ 25-గురువారం) బయటకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకే నామినేషన్ గడువు ఉంది.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ‘విడదల రజిని’ అనే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కర్యాలయానికి వచ్చింది. ఆమె నామినేషన్ పేపర్లపై విడదల రజిని అనే పేరును చూసి వైసీపీ నేత అప్రమత్తమయ్యాడు. వెంటనే పార్టీ శ్రేణులకు విషయం చెప్పాడు. విడదల రజిని పేరు ఉండడంతో చిలుకలూరి పేట ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో ఆమెకు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఏర్పడింది.
దీంతో అప్రమత్తమైన వైసీపీ నాయకులు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్న మహిళను నుంచి బలవంతంగా నామినేషన్ వేయకుండా బయటకు తీసుకువచ్చారు. అయితే నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ వార్తలు వ్యాపించాయి. కానీ, వైసీపీ నేతలు మాత్రం సదరు మహిళతో టీడీపీ నాయకులే నామినేషన్ వేయించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.
కాగా మహిళ కిడ్నాప్ వార్తలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ ఎక్కడ ఉందో గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు ఎటువంటి ఆపద లేదని బాగానే ఉందని చెప్తున్నారు. కానీ ఆమె మళ్లీ తన నామినేషన్ ను వేస్తుందా? వేయదా? అనేది మాత్రం ఇంకా తెలియలేదు. విడదల రజినీ పేరు ప్రముఖంగా ప్రస్తావించడంతో ఏపీలో కంగారు నెలకొంది.