After Meals Do not do this : మనం రోజు భోజనం చేస్తుంటాం. మన శరీరం బలంగా ఉండాలంటే తినడం సహజం. తినకపోతే నీరసం వస్తుంది. ఏ పని చేయడానికి వీలు కాదు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ తిండి కలవాడే కండకలవాడని గురజాడ చెప్పారు. కొందరు బతకడానికి తింటారు. మరికొందరు తినడానికే బతుకుతారు. ఏదైనా అతిగా తింటే అనర్థమే. రోగాలు చుట్టుముడతాయి.
తిన్న తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. తాగితే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తిన్న తరువాత గంటన్నర ఆగి నీళ్లు తాగితే త్వరగా జీర్ణం అవుతుంది. మనం తినేటప్పుడు నీళ్లు తాగితే లోపల యాసిడ్ ఉత్పత్తి అయి అది నీళ్లతో కలిస్తే తిన్న పదార్థాలు జీర్ణం కావు. తిన్న వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదు.
భోజనం చేసిన తరువాత పండ్లు తినకూడదు. అలా తింటే పొట్ట పెరుగుతుంది. పండ్లు భోజనం తరువాత అరగంటకైనా తినాలి. లేకపోతే భోజనానికి అరగంట ముందు అయినా తినాలి. భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేయకూడదు. పది నిమిషాలు ఆగి తరువాత వాకింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకోవాలి. అందుకే తిన్న తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది.
భోజనం చేసిన తరువాత ధూమపానం చేయడం కూడా మంచి అలవాటు కాదు. అలా చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయి. తిన్న వెంటనే నిద్రపోతే కూడా మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. భోజనం ముగించాక రెండు గంటలు మేల్కొనే ఉండాలి. తరువాత నిద్ర పోతే మంచి నిద్ర పడుతుంది. ఇలా భోజనం చేశాక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇవి పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.