![Sivaji Raja](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/Mohan-Babu-Paritala-Ravi-settled-1.jpg)
శివాజీ రాజా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంతో జరిగిన గొడవ గురించి వెల్లడించారు. అప్పట్లో సినీ పరిశ్రమలోని కొంతమంది స్నేహితులతో కలిసి హాస్య నటుడు బ్రహ్మానందం పేరు మీద ఓ ట్రస్ట్ నెలకొల్పామని చెప్పారు. అయితే ఆ ట్రస్టులోని డబ్బు కొంత పక్కదారి పట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆ విషయం గురించి బ్రహ్మానందంతో చర్చించినట్లు వెల్లడించారు. అయితే ఈ విషయం కాస్త కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరిటాల రవి తదితరుల దగ్గరికి చేరిందని తెలిపారు. వారు యాక్టర్ శ్రీహరితో తనకు ఫోన్ చేయించి పిలిపించారని చెప్పారు. డబ్బుల గురించి గొడవపై తనతో మాట్లాడగా విషయం సర్ధుమణిగిందని వారితో కూడా చెప్పానన్నారు. ఈ విషయంలో కొందరు బ్రహ్మానందంతో గొడవలు గొడవ జరగడంతో ఇప్పటికీ మాట్లాడుకోవడం లేదని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సంఘటనతో మొదటిసారి పరిటాల రవి ని దగ్గరి నుంచి చూశానని చెప్పారు.
అయితే సినిమా ఇండస్ర్టీలో లోపల జరిగేది ఒకటని, బయటకు మరోలా ప్రచారం అవుతుందని చెప్పారు. బ్రహ్మానందంతో తానెప్పుడూ ఫ్రెండ్లీగానే ఉంటానని, ఆయన కూడా తనతో పాటు చాలా మందితో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారని చెప్పారు. ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చినా అవి అక్కడికే సమసిపోతాయని వెల్లడించారు.