Mohan Babu : నిర్మాత మంచు మోహన్బాబుకు చెక్ బౌన్స్ కేసులో హైదరాబాద్ ఎర్రమంజిల్ మెట్రోపాలిటిన్ మేజిస్టేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.. ఇది అప్పట్లో సంచలనమైంది. దీనిపై అసలు నిజాలను మోహన్ బాబు పంచుకున్నారు. తనకు జైలుశిక్ష పడడానికి గల కారణం ఎవరో బయటపెట్టాడు. దర్శకుడు వైవీఎస్ చౌదరి కుట్రదారు అని వివరించారు.
మోహన్బాబు మాట్లాడుతూ ‘‘2009లో `సలీమ్` సినిమా చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని దర్శకుడు వైవిఎస్ చౌదరికి చెల్లించేశామని… మా బ్యానర్లోనే మరో సినిమా చేయడానికిగాను రూ.40లక్షల అడ్వాన్స్ చెక్ ఇచ్చామని’’ తెలిపారు. `సలీమ్` అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో వైవీఎస్ చౌదరితో తదుపరి చేయాల్సిన సినిమాను రద్దు చేసుకున్నామని మోహన్ బాబు వివరించాడు.నాపై చెక్ బౌన్స్ కేసుని వేసి… కోర్టును తప్పు దోవ పట్టించాడని మండిపడ్డారు. ఆ కేసులోనే అప్పుడు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిందని.. ఇందులో నా తప్పు ఏమాత్రం లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు.
అయితే సినిమా క్యాన్సల్ చేసుకున్నామనే విషయం వైవీఎస్ చౌదరికి చెప్పి ఆ 40లక్షల చెక్ను బ్యాంకులో వేయవద్దని సూచించామని మోహన్ బాబు వివరించారు. కానీ దీన్ని మనసులో పెట్టుకున్న వైవీఎస్ చౌదరి కుట్రపన్ని కావాలనే చెక్ను బ్యాంకులో వేసి చెక్ను బౌన్స్ చేశారని మోహన్ బాబు అసలు నాటి నిజాన్ని బయటపెట్టారు.