Attack on Telangana student in America : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై దాడి జరిగింది. యూఎస్ లో ఎంఎస్ చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆ విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం కు చెదిన పుచ్చా వరుణ్ రాజ్ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. .
అయితే ఇండియానా రాష్ర్టంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్నాడు. వరుణ్ ఎంఎస్ చేస్తూనే పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు. మంగళవారం వరుణ్ జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా, ఈ దాడి జరిగింది. ఒక్కసారిగా ఒక అగంతకుడు వరుణ్ పై కత్తితో దాడికి దిగాడు. వరుణ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వరుణ్ ను దవాఖానకు తరలించారు.
అయితే వరుణ్ రాజ్ పై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా పోలీసులు తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయంలో వరుణ్ తండ్రి ప్రభుత్వ టీచర్ అయిన రామ్మూర్తి వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ ని కలిసి పరిస్థితిని వివరించారు. తన కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని మంత్రిని కోరారు.
అయితే ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. వరుణ్ కుటుంబానికి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని చెప్పారు. అమెరికాలోని రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై మిత్రుల సాయంతో వరుణ్ కు సహకారం అందిస్తామని చెప్పారు. వరుణ్ కుటుంబ సభ్యులతో తన టీం టచ్ లోకి వెళ్తుందని చెప్పారు.