వైఎస్ వివికానందరెడ్డి కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తనను అరెస్ట్ చేస్తారేమోనని అయన ఆందోళన చెందుతున్నాడు.. హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ సాగుతున్న వేళ అవినాష్ పులివెందులలో ఉన్నారు. ప్రజాదర్భార్ నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. సుప్రీం ఆదేశాల ఉత్తర్వులు అందితే ఈ రోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం నిర్ణయం మేరకు సీబీఐ నిర్ణయాలు ఉండనున్నాయి.
ముందస్తు బెయిల్ విచారణ:వివేకా హత్య కేసులో అవినాష్ ఎపిసోడ్ లో చోటు చేసుకొనే పరిణామాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. అవినాష్ ను ఇప్పటికే ఆరు సార్లు విచారించిన సీబీఐ, ఎంపీ ఇచ్చిన సమాచారం ఆధారంగా సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని విచారించారు. హత్య జరిగిన రోజున కీలకంగా మారిన లేఖ గురించి ఆరా తీసినట్లు సమాచారం. సుదీర్ఘంగా సునీత- రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించింది. సుప్రీంకోర్టులో అవినాష్ పిటీషన్ పైన వెలువడిన నిర్ణయాలతో హైకోర్టులో జరిగే విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
25 న అవినాష్ ముందసు బెయిల్ పిటీషన్ పై విచారణ జరగాల్సి ఉన్నా, సుప్రీంకోర్టు ఉత్తర్వుల పరిశీలన కోసం 26కు (బుధవారం) కు కేసు వాయిదా వేసారు. మరోసారి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో ఈ రోజు ప్రస్తావిస్తే ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది.